దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్నవారి సంఖ్య మూడు కోట్లు దాటింది. దేశంలో గత 24 గంటల్లో 39,649 మంది బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 3,00,14,713 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 97.22 శాతంగా నమోదైంది. మరోవైపు వరుసగా 15 రోజులు నుంచి రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు 50 వేల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. కొత్తగా 37,154 కరోనా కేసులు నమోదవడంతో జూలై 12, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,74,376 చేరుకుంది.
దేశంలో 4 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు:
ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, అస్సాం, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఛత్తీస్ గడ్ వంటి 10 రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో ప్రస్తుతం 4,50,899 (1.46%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 724 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,08,764 కి పెరగగా, కరోనా మరణాల రేటు 1.32 శాతంగా ఉంది. ఇక జూలై 11, ఆదివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 43,23,17,813 కు చేరుకుంది. గత 24 గంటల్లో 14,32,343 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ