ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిదాంబి శ్రీకాంత్ కు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. “చారిత్రాత్మక రజత పతకాన్ని గెలుచుకున్న శ్రీకాంత్ కు అభినందనలు. శ్రీకాంత్ సాధించిన ఈ విజయం అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది మరియు బ్యాడ్మింటన్పై మరింత ఆసక్తిని కలిగిస్తుంది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ముందుగా ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో శ్రీకాంత్ ఫైనల్ కు చేరుకున్నాడు. ఇక ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీకాంత్ 15-21, 20-22 తో సింగపూర్ షట్లర్ కీన్ యూ చేతిలో పరాజయం పొందడంతో స్వర్ణ పతకాన్ని కోల్పోయి, రజతాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే రజతం గెలుచుకున్న శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత్ తరుపున ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికి పురుషుల సింగిల్స్ లో 1983లో ప్రకాశ్ పదుకొణె, 2019లో భమిడిపాటి సాయిప్రణీత్ కాంస్య పతకాలు సాధించగా, తాజాగా రజతంతో శ్రీకాంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరోవైపు తాజా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత్ షట్లర్ లక్ష్యసేన్ కూడా కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ