2024 లోక్‌సభ ఎన్నికలలోపు 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం – ప్రధాని మోదీ

PM Modi Distributes 71000 Appointment Letters To Newly Inducted Recruits Under Rozgar Mela,PM Modi Distributes 71000 Appointment Letters,Appointment Letters To Newly Inducted Recruits,Recruits Under Rozgar Mela,Mango News,Mango News Telugu,PM Rozgar Mela 2023,Rozgar Mela,Under Rozgar Mela,PM to distribute 71000 appointment letters,PM Rozgar Mela 2023 Latest News,PM Rozgar Mela 2023 Latest Updates,PM Rozgar Mela 2023 Live News,Rozgar Mela Appointment Letters Latest News,Rozgar Mela Appointment Letters News Today

2024 లోక్‌సభ ఎన్నికలలోపు 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రీయ రోజ్ గార్ మేళా కింద కొత్తగా కొలువుల్లో చేరిన దాదాపు 71,000 మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారు. మరోవైపు ఇదే కార్యక్రమంలో భాగంగా.. కేంద్రమంత్రి ఆయుష్ సర్బానంద సోనోవాల్, అస్సాంలోని గువహటిలోని రైల్ రంగ్ భవన్ కల్చరల్ హాలులో అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. అలాగే మరో కేంద్ర మంత్రి రామేశ్వర్ తెలి నాగాలాండ్ లోని దిమాపూర్ లో అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఉద్యోగాల్లో నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ‘కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తుంది. ప్రతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. వ్యవసాయ రంగంలో వ్యవసాయ యాంత్రీకరణ పెరిగి గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగావకాశాలు పెరిగాయి. అలాగే ఉపాధి కల్పనకు ఆరోగ్య రంగం కూడా అత్యుత్తమ ఉదాహరణగా మారుతోంది. ఇంకోవైపు ఓడరేవుల రంగం అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని, రక్షణ శాఖకు కావాల్సిన 300 పరికరాలను మన దేశం ఉత్పత్తి చేస్తుంది. 2014 వరకు భారతదేశంలో 74 విమానాశ్రయాలు ఉంటే, ఇప్పుడు 148 విమానాశ్రయాలు ఉన్నాయి. విమానాశ్రయాల పెరుగుదల కారణంగా, కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభించాయి’ అని పేర్కొన్నారు.

కాగా రోజ్‌గార్ మేళా డ్రైవ్‌లో భాగంగా ఈ 71,000 మంది.. ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, సీనియర్ కమర్షియల్ కం టికెట్ క్లర్కు, ఇన్ స్పెక్టర్, సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుళ్లు, స్టెనోగ్రాఫర్లు, జూనియర్ అకౌంటెంట్లు, పోస్టల్ అసిస్టెంట్లు, ఆదాయపు పన్ను శాఖ ఇన్ స్పెక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, లైబ్రేరియన్ లు, నర్సులు వంటి ఉద్యోగాలు/పోస్టులలో చేరనున్నారు. ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన వారందరికీ ఆన్‌లైన్ ఓరియంటేషన్ కోర్సు ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =