రాజకీయంగా సీఎం కేసీఆర్ను ఎదుర్కొనే ధైర్యం లేకే.. తనపై ఫేక్ చాట్స్తో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు ఆమె 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ బుధవారం విడుదల చేసిన వాట్సప్ చాట్పై స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత లేఖలో ఇలా పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీపై ఉదేశ పూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కేసీఆర్ జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక, తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ మీడియాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
లేఖలో ఎమ్మెల్సీ కవిత ఇంకా ఇలా తెలిపారు.. ‘ఒక ఆర్థిక నేరగాడు, అనామక లేఖను విడుదల చేయడం, దానిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, ఆ తర్వాత వెంటనే ఎంపీ అరవింద్ బీజేపీ టూల్ కిట్లో పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని చేయడం.. ఇలా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు. అసలు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో నాకు పరిచయం కూడా లేదు. అతనెవరో కూడా నాకు తెలియదు. కానీ వాస్తవాలను ఏవి పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయి. ఇదివరకు నా మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాశారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్, వారి కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు.. పాలు ఏంటో, నీళ్లేంటో తెలిసిన చైతన్య జీవులు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈర్శ్యతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తెలంగాణ సమాజం తప్పకుండా తరిమి కొడుతుంది. తెలంగాణ బిడ్డలం తలవంచం.. తెగించి కొట్లాడుతాం’ అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE