ఎయిర్ ఫోర్స్ డే (వైమానిక దళ దినోత్సవం-అక్టోబర్ 8) సందర్భంగా భారత వైమానిక దళ సభ్యులకు మరియు వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “వైమానిక దళ దినోత్సవం సందర్భంగా, ధైర్యవంతులైన వైమానిక యోధులకు మరియు వారి కుటుంబాలకు నా శుభాకాంక్షలు. నభః స్పృశం దీప్తం నినాదానికి అనుగుణంగా, భారత వైమానిక దళం దశాబ్దాలుగా అసాధారణమైన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. వారు దేశాన్ని సురక్షితంగా ఉంచారు మరియు విపత్తుల సమయంలో కూడా అద్భుతమైన మానవ స్ఫూర్తిని ప్రదర్శించారు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 90వ వార్షికోత్సవం శనివారం చండీగఢ్లో ఘనంగా ప్రారంభమైంది. చండీగఢ్లోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో సెరిమోనియల్ పరేడ్ జరిగింది. ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ఈ పరేడ్ను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, ఎయిర్ మార్షల్ శ్రీకుమార్ ప్రభాకరన్ మరియు పలువురు సీనియర్ ఐఏఎఫ్ అధికారులు పాల్గొన్నారు. వార్షిక వైమానిక దళ దినోత్సవ పరేడ్ మరియు ఫ్లై-పాస్ట్ ను ఐఏఎఫ్ తొలిసారిగా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం వెలుపల నిర్వహిస్తుంది. ఇక సుఖ్నా లేక్ వద్ద జరిగే ఐఏఎఫ్ ఏరియల్ షోకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరుకానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY