ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష పదవికి పోటీపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే ప్రచారాన్ని వేగవంతం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత మల్లికార్జున్ ఖర్గే తనకు మద్దతుగా అన్ని రాష్ట్రాలను సందర్శిస్తున్నారు. అయితే మల్లికార్జున్ ఖర్గే అభ్యర్థిత్వానికి పార్టీ అధిష్టానం మద్దతు ఉన్నట్లు ప్రచారం జరగడంతో ఆయన ఎక్కడికి వెళ్లినా పార్టీ నేతలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు (8 అక్టోబర్, శనివారం) హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సీనియర్లు బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం పలికారు. శనివారం గాంధీభవన్లో పార్టీ నేతలతో సమావేశమవనున్న ఖర్గే.. తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా టీపీసీసీ డెలిగేట్స్ను కోరనున్నారు. కాగా ఖర్గే వెంట తెలంగాణకు చెందిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా వచ్చారు. ఇక దాదాపు రెండు దశాబ్దాల తర్వాత 2002 తర్వాత కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష్య పదవికి మళ్ళీ ఎన్నికలు జరుగుతుండటం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY