ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 19న హైదరాబాద్ లో పర్యటించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కూడా వందే భారత్ రైలు ప్రారంభం కానుందని గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతుండగా, ఎట్టకేలకు సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత విశాఖపట్నం వరకూ ఈ రైలును పొడిగించే అవకాశాలున్నట్టు సమాచారం.
అలాగే దాదాపు రూ.700 కోట్లతో చేపట్టబోయే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులకు కూడా ఈ పర్యటనలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతన వసతులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అయినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ పర్యటనలో బీబీనగర్ ఎయిమ్స్ ను ప్రధాని మోదీ సందర్చించే అవకాశం ఉంది. అలాగే పార్టీ సంబంధిత కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారని సమాచారం. అయితే ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించి ఇంకా అధికారిక షెడ్యూల్ వెలువడాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE