తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 25, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 54,059 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 15,654 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 641, రంగారెడ్డి లో 171, వరంగల్ అర్బన్ లో 131, మేడ్చల్ లో 91, సంగారెడ్డిలో 61, కరీంనగర్ లో 51, నాగర్కర్నూల్ లో 46, మహబూబ్నగర్లో 38, కామారెడ్డిలో 36, నిజామాబాద్లో 32, మహబుబాబాద్లో 29, రాజన్న సిరిసిల్లలో 27, మంచిర్యాలలో 27, సూర్యాపేటలో 22, జనగామలో 21, వరంగల్ రూరల్లో 21, మెదక్లో 21, ఖమ్మంలో 18, భద్రాద్రి కొత్తగూడెంలో 17, పెద్దపల్లిలో 16, ఆదిలాబాద్ లో 14, ములుగులో 12, యాదాద్రి భువనగిరిలో 11 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (జూలై 25, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 54,059
- కొత్తగా నమోదైన కేసులు : 1593
- నమోదైన మరణాలు : 8
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 41,332
- యాక్టీవ్ కేసులు : 12,264
- మొత్తం మరణాల సంఖ్య : 463
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu