ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (100) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. గాంధీనగర్ లోని సెక్టార్ 30 శ్మశానవాటికలో ప్రధాని మోదీ తన సోదరులతో కలిసి తల్లి హీరాబెన్ కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తల్లి హీరాబెన్ మోదీ మరణంపై ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు.
“నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తిచేసుకుని దేవుడి చెంతకు చేరారు. ఒక సన్యాసి ప్రయాణం, నిస్వార్థ కర్మయోగి యొక్క చిహ్నం మరియు విలువలకు కట్టుబడి ఉండే జీవితం కలిగి ఉన్న త్రిమూర్తులు లక్షణాలను అమ్మలో నేను ఎప్పుడూ అనుభూతి చెందాను. తన 100వ పుట్టిన రోజు సందర్భంగా నేను అమ్మను కలిసినప్పుడు ఓ విషయం చెప్పింది. తెలివితో పని చేయండి, స్వచ్చతతో జీవించండి అని అమ్మ చెప్పింది. ఆ విషయాన్ని నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE