తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ, ముగిసిన హీరాబెన్ అంత్యక్రియలు

PM Narendra Modi Performed the Last Rites of his Mother Heeraben Modi in Gandhinagar,Prime Minister Modi Carried His Mother,Heeraben Last Rites Ended,Heeraben Modi Last Rites,Mango News,Mango News Telugu,Heeraben Modi Passed Away,PM Narendra Modi's Mother,PM Modi's Mother Heeraben,Heeraben Admitted in Hospital,Heeraben Health Deteriorates,Heeraben Modi Mother Age,Heeraben Modi Alive,Heeraben Modi Birth Date,Modi Mother Age 100 Years,Heeraben Modi Age In 2022,Heeraben Modi Children,Heeraben Modi Wikipedia,Age Of Pm Modi Mother Heeraben,Modi Cm How Many Times,Pm Modi'S Phone Number,Pm Modi'S Contact Number

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ (100) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. హీరాబెన్ అంత్యక్రియలను గాంధీనగర్‌లోని శ్మశానవాటికలో నిర్వహించారు. ముందుగా శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ గాంధీనగర్ చేరుకొని, తన తల్లికి నివాళులు అర్పించారు. అనంతరం తన సోదరులతో కలిసి తల్లి హీరాబెన్ అంత్యక్రియలు నిర్వహించారు.

ముందుగా గాంధీనగర్‌ లోని నివాసం నుంచి హీరాబెన్‌ అంతిమయాత్ర ప్రారంభం కాగా, ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన తల్లి పాడె మోశారు. అంతిమయాత్ర వాహనంలోనూ తల్లి పార్థివదేహం వద్దే ప్రధాని మోదీ కూర్చున్నారు. గాంధీనగర్‌ లోని సెక్టార్ 30 శ్మశానవాటికలో ప్రధాని మోదీ తన సోదరులతో కలిసి తల్లి హీరాబెన్ కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హీరాబెన్ మోదీ అంత్యక్రియల్లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మాజీ సీఎం విజయ్ రూపానీ, గుజరాత్ కేబినెట్ మంత్రులు కూడా హాజరయ్యారు.

బుధవారం ఉదయం ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమితం కుటుంబ సభ్యులు వెంటనే అహ్మదాబాద్‌ లోని యు.ఎన్‌.మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు హీరాబెన్‌ తుదిశ్వాస విడిచినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలు రాష్ట్రాల మంత్రులు, సినీ, క్రీడా ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =