ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా 2021 డిసెంబర్లో అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలును ఇరువురు నేతలు సమీక్షించారని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ వస్తువులు, ఎరువులు మరియు ఫార్మా ఉత్పత్తులలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించడంపై ఆలోచనలను పరస్పరం చర్చించుకున్నారని చెప్పారు.
“అలాగే అంతర్జాతీయ ఇంధనం మరియు ఆహార మార్కెట్ల స్థితి సహా ప్రపంచ సమస్యలపై కూడా ఇరువురూ నేతలు చర్చించారు. మరోవైపు ఉక్రెయిన్లో కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో, చర్చలు మరియు దౌత్యానికి అనుకూలంగా భారతదేశం యొక్క దీర్ఘకాల వైఖరిని ప్రధాని మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. ప్రపంచ, ద్వైపాక్షిక అంశాలపై ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY