ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 12, మంగళవారం జార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘర్ మరియు బీహార్ రాష్ట్రంలోని పాట్నా నగరాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 1:15 గంటలకు ప్రధాని మోదీ డియోఘర్లో రూ.16,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్లు ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని గణనీయంగా పెంచుతాయని, కనెక్టివిటీని మెరుగుపరుస్తూ, ప్రజల జీవన సౌలభ్యానికి ప్రేరణనిస్తాయన్నారు. దేశం నలుమూలల నుండి భక్తులకు ముఖ్యమైన మతపరమైన గమ్యస్థానంగా ఉన్న బాబా బైద్యనాథ్ ధామ్కు ప్రత్యక్ష అనుసంధానాన్ని అందించడంలో భాగంగా, డియోఘర్ విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. దాదాపు 400 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించారు. ఈ విమానాశ్రయం యొక్క టెర్మినల్ బిల్డింగ్ సంవత్సరానికి ఐదు లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణించేలా ఏర్పాటు చేయబడింది.
మధ్యాహ్నం 2:40 గంటలకు పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన బాబా బైద్యనాథ్ ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు పాట్నాలో బీహార్ శాసనసభ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. బీహార్ విధానసభ 100 సంవత్సరాల జ్ఞాపకార్థం నిర్మించిన శతాబ్ది స్మృతి స్తంభాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. అదేవిధంగా విధానసభ మ్యూజియంకు, విధానసభ అతిథి గృహానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY