ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్నారా? త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో శాసనసభ్యుల మద్దతు కోసం జూలై 12న తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరగనున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను తమ అభ్యర్థిగా బరిలోకి దించడం తెలిసిందే. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో అభ్యర్థులు మద్దతు కూడగట్టుకుని ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము వరుసగా అనేక రాష్ట్రాల పర్యటనలకు వెళ్తున్నారు. దీనిలో భాగంగానే ఆమె జూలై 12న తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఏదేని కారణంతో ఆరోజు రాలేకపోయినా వచ్చే వారంలో ఎదో ఒక రోజు ముర్ము తెలంగాణకు రావొచ్చని సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ