ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో బంగ్లాదేశ్ లో పర్యటించనున్నారు. బంగ్లాదేశ్ దేశ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానం మేరకు మార్చి 26, 27 తేదీల్లో ప్రధాని మోదీ బంగ్లాదేశ్ కు వెళ్లనున్నారు. ఈ మేరకు దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ చివరిసారిగా 2015 లో బంగ్లాదేశ్ లో పర్యటించారు. ముజిబ్ బోర్షో-షేక్ ముజిబూర్ రెహ్మాన్ శత జయంతి ఉత్సవాల నిర్వహణ, బంగ్లా విముక్తి యుద్ధానికి 50 సంవత్సరాల పూర్తవడం, భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తవడం వంటి సందర్భాల నేపథ్యంలో ప్రధాని మోదీ బంగ్లాదేశ్ కు వెళ్లనున్నారు.
ఈ పర్యటన సందర్భంగా మార్చి 26 న బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. అలాగే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ద్వైపాక్షిక సంప్రదింపులు జరపడంతో పాటుగా బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎండి.అబ్దుల్ హమీద్, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎ.కె.అబ్దుల్ మోమెన్ తో సమావేశాలు జరగనున్నాయి. గత సంవత్సరం కరోనా మహమ్మారి వ్యాప్తి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ ఎలాంటి విదేశీ పర్యటనలు చేపట్టలేదు. కరోనా మహమ్మారి అనంతరం తోలి విదేశీ పర్యటనగా ప్రధాని మోదీ బంగ్లాదేశ్ కు వెళ్లనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ