ప్రధాని నరేంద్ర మోదీ రేపు (జూన్ 14, మంగళవారం) మహారాష్ట్ర రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటలకు పూణేలోని దేహులో జగత్గురు శ్రీ సంత్ తుకారాం మహారాజ్ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 4:15 గంటలకు ముంబయిలోని రాజ్ భవన్లో జల్ భూషణ్ భవనం మరియు విప్లవకారుల గ్యాలరీని ప్రధాని ప్రారంభిస్తారు. జల్ భూషణ్ 1885 నుండి మహారాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసంగా ఉంది. ఆ భవన జీవితకాలం పూర్తయిన తర్వాత దానిని కూల్చివేసి, దాని స్థానంలో కొత్త భవనం నిర్మించారు. 2019 ఆగస్టులో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు, తాజాగా పూర్తిస్థాయిలో సిద్దమైన జల్ భూషణ్ భవనాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.
ఆ తర్వాత ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ముంబయి సమాచార్ ద్విశతాబ్ది మహోత్సవ్లో ప్రధాని పాల్గొంటారు. జూలై 1, 1822న ఫర్దుంజీ మార్జ్బాంజీ చేత ముంబయి సమాచార్ను వారపత్రికగా ముద్రించడం ప్రారంభించబడింది. ఇది 1832 నుంచి దినపత్రికగా మారింది. ఈ వార్తాపత్రిక 200 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రచురించబడుతుండగా, ఈ విశిష్ట ఫీట్కు గుర్తుగా ముంబయి సమాచార్ ద్విశతాబ్ది మహోత్సవ్లో ప్రధాని మోదీ పాల్గొని, పోస్టల్ స్టాంప్ను కూడా విడుదల చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY