భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తోటి దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక సందేశం విడుదల చేశారు. “దేశప్రజలందరికీ, ముఖ్యంగా క్రైస్తవ సోదరులు మరియు సోదరీమణులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ యావత్ మానవాళికి శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీక. ఈ రోజున మనం యేసుక్రీస్తు ఇచ్చిన కరుణ మరియు త్యాగం యొక్క సందేశాన్ని గుర్తుచేసుకుంటాము. క్రిస్మస్ పండుగ ఒకరినొకరు ప్రేమతో మరియు దయతో చూసుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క దైవిక బోధనలను మన జీవితాలలో స్వీకరించడానికి ప్రతిజ్ఞ చేద్దాం” అని సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE