తెలంగాణలోని అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోని కీలక నిందితులలో ఒకరైన నందకుమార్ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అనుమతి లభించింది. ఈ మేరకు నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఒక్కరోజు విచారణకు పర్మిషన్ ఇచ్చింది. కాగా.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో.. ఎమ్మెల్యేల కొనుగోలుకు కోట్ల రూపాయల డీల్ కుదిరిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారని, కావున మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా నందకుమార్ను విచారించేందుకు అనుమతినివ్వాలని ఈడీ అధికారులు కోర్టుకి విన్నవించారు. ఈ క్రమంలో దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నందకుమార్ను విచారించేందుకు ఈడీ చేసిన అభ్యర్థనను అంగీకరించింది. దీంతో వచ్చే సోమవారం చంచల్ గూడ జైలులో నందకుమార్ను ఈడీ అధికారులు విచారించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ