భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 నూతన సంవత్సరం సందర్భంగా తోటి దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక సందేశం విడుదల చేశారు. “నూతన సంవత్సరం సందర్భంగా తోటి పౌరులందరికీ మరియు విదేశాలలో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం ప్రారంభం, తాజా శక్తితో నింపబడి, మన జీవితాల్లో కొత్త ఆనందాన్ని, లక్ష్యాలను, ప్రేరణలను మరియు గొప్ప విజయాలను తీసుకురావాలి. ఈ సందర్భంగా దేశ ఐక్యత, సమగ్రత, సమ్మిళిత అభివృద్ధికి మనల్ని మనం పునరంకితం చేసుకోవాలని సంకల్పిద్దాం. 2023 సంవత్సరంలో మన దేశం మరియు ప్రజల యొక్క పురోగతి, శ్రేయస్సు కోసం కోరుకుంటున్నాను” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE