త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. శనివారం ఆయన తన రాజీనామాను గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యకు సమర్పించారు. అయితే ఇటీవలి ఢిల్లీ పర్యటన తర్వాత త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ హఠాత్తుగా రాజీనామా చేశారు. గురువారం న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశమైన తర్వాత ఈ పరిణామం జరిగడం గమనార్హం. ఈ నేపథ్యంలో.. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభా పక్షం సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. దీనికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేలను బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది.
బిప్లవ్ కుమార్ దేవ్ బీజేపీ నుండి ఈశాన్య రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ట్విప్రా (IPFT) భాగస్వామ్యంతో 2018 అసెంబ్లీ ఎన్నికలలో 25 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ పాలనను పార్టీ తొలగించింది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఒక సంవత్సరం మాత్రమే మిగిలి ఉన్నందున, బిజెపి పార్టీలో సాములా మార్పులకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సీనియర్ గిరిజన నాయకుడు బికాష్ దెబ్బర్మను పార్టీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నియమించగా, సీనియర్ గిరిజన నాయకుడు బికాష్ దెబ్బర్మను పార్టీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఒక సంవత్సరం మాత్రమే సమయం ఉన్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మార్పు రాష్ట్ర రాజకీయాలలో సంచలనమైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ