కేరళ రాష్ట్రంలో మూడో వేవ్ నేపథ్యంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,16,003 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 51,739 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 44.60 శాతంగా నమోదైంది. అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,26,596 కు చేరుకుంది. ఇక కొత్తగా కరోనాకు చికిత్స పొందుతూ గత 24 గంటల్లో మరో 11 మంది మరణించినట్టు తెలిపారు.
పత్రాలు ఆలస్యంగా అందినందున గత 24 గంటల్లో మునుపటి రోజులకు సంబంధించిన 85 మరణాలను, అలాగే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 57 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 52,434 కి పెరిగింది. కొత్తగా కరోనా నుంచి 42,653 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 54,63,960 కు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 3,09,489 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ