భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు, ఎల్లుండి (ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో) ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 10, శుక్రవారం భువనేశ్వర్లో జరిగే జ్ఞానప్రభ మిషన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి హాజరుకానున్నారు. అలాగే భువనేశ్వర్ లోని రమాదేవి మహిళా విశ్వవిద్యాలయంలో 2వ స్నాతకోత్సవంలో కూడా రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఇక ఫిబ్రవరి 11, శనివారం నాడు కటక్లోని ఐసీఏఆర్-నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 2వ ఇండియన్ రైస్ కాంగ్రెస్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE