టోక్యో ఒలింపిక్స్ లో మహిళల 49 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చాను సిల్వర్ మెడల్ (రజత పతకం) గెలుచుకుంది. కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిప్టింగ్ లో భారత్ కు పతకం అందించిన మహిళగా మణిపూర్ కు చెందిన మీరాభాయి చాను చరిత్ర సృష్టించింది. ఈ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన మీరాభాయి చానుకు పలువురు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, రాజకీయనాయకులు, క్రీడా, సినీరంగ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మీరాభాయి చానుపై ప్రశంసలు కురిపించారు.
టోక్యో ఒలింపిక్స్-2020 లో వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం సాధించి భారతదేశానికి పతకాల సంఖ్యను ప్రారంభించిన మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. “టోక్యో ఒలింపిక్స్-2020లో ఇంతకంటే సంతోషకరమైన ప్రారంభం కావాలని అనుకోలేదు. మీరాభాయి చాను యొక్క అద్భుతమైన ప్రదర్శనతో భారతదేశం సంతోషించింది. వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం సాధించినందుకు ఆమెకు అభినందనలు. ఆమె విజయం ప్రతి భారతీయుడిని ప్రేరేపిస్తుంది. చీర్ 4 ఇండియా” అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ