కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల పరంపర కొనసాగుతుంది. తాజాగా సోమవారం మరోసారి ప్రధాని మోదీ పాలనపై ఆయన విమర్శలు చేశారు. “విద్యుత్ సంక్షోభం, ఉద్యోగాల సంక్షోభం, రైతు సంక్షోభం, ద్రవ్యోల్బణం సంక్షోభం… ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేయాలనే దానిపై ప్రధాని మోదీ 8 సంవత్సరాల తప్పుడు పాలన ఒక కేస్ స్టడీ” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
అలాగే రెండ్రోజుల క్రితం ట్వీట్ చేస్తూ, అధిక ఇంధన ధరలు, బొగ్గు కొరత, ఆక్సిజన్ కొరతపై కేంద్రం రాష్ట్రాలను నిందిస్తుందన్నారు. మొత్తం ఇంధన పన్నుల్లో 68% కేంద్రం తీసుకుంటుందని, అయినప్పటికీ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఓవైపు ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండగా, ఆయన పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ