ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో నూతన సంవత్సరం సందర్భంగా వినియోగదారులకు శుభవార్త చెప్పింది. జనవరి 1, 2021 నుంచి తమ వినియోగదారులకు గతంలో లాగానే ఏ నెట్వర్క్ లకైనా ఉచిత వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు జియో సంస్థ ప్రకటించింది. ఇంటర్కనెక్ట్ యూసేజ్ ఛార్జీలు(ఐయూసీ) పై ట్రాయ్ ఇచ్చిన నిబంధనల ప్రకారం అక్టోబర్ 10, 2019 నుంచి జియో నుంచి ఇతర నెట్వర్క్లకు చేసే వాయిస్ కాల్స్పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. వాయిస్ కాల్స్ నిమిత్తం వినియోగదారులు చెల్లించిన మొత్తానికి బదులుగా డేటా బ్యాలన్స్ ను జియో అందించింది. కాగా ఐయూసీ ఛార్జీల అమలు గడువు డిసెంబర్ 31,2020 తో ముగియనుంది. ఈ నేపధ్యంలో ట్రాయ్ ఆదేశాల మేరకు జనవరి 1 నుంచి జియో మళ్లీ ఇతర నెట్వర్క్ లకు ఉచిత వాయిస్ కాల్స్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ