ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం (జనవరి 20, శుక్రవారం) రోజ్గార్ మేళా కింద వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రభుత్వ శాఖలు మరియు సంస్థల్లో కొత్తగా నియమితులైన దాదాపు 71,000 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది
రోజ్గార్ మేళా అనేది ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధాని మోదీ యొక్క నిబద్ధత నెరవేర్చే దిశగా ఒక అడుగని పేర్కొన్నారు. రోజ్గార్ మేళా మరింత ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని మరియు యువతకు వారి సాధికారత మరియు జాతీయ అభివృద్ధిలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి అర్ధవంతమైన అవకాశాలను అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు.
జూనియర్ ఇంజనీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అకౌంటెంట్, గ్రామీణ్ డాక్ సేవక్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, టీచర్, నర్స్, డాక్టర్, సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్, పీఏ, ఎంటీఎస్ ఇలా కేంద్ర ప్రభుత్వం క్రింద వివిధ స్థానాలు/పోస్టులలో దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన కొత్త రిక్రూట్లు చేరతారని తెలిపారు. అలాగే కర్మయోగి ప్రారంభ్ మాడ్యూల్ నుండి కొత్తగా చేరిన అధికారుల పొందిన అనుభవాన్ని కూడా ఈ రోజ్గార్ కార్యక్రమంలో పంచుకుంటారని తెలిపారు. కర్మయోగి మాడ్యూల్ అనేది వివిధ ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా నియమితులైన వారందరికీ ఆన్లైన్ ఓరియంటేషన్ కోర్సు అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE