టోక్యో పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత మహిళా షూటర్ అవని లేఖరా మరోసారి సత్తా చాటింది. శుక్రవారం ఉదయం జరిగిన షూటింగ్ (50మీటర్ల 3P SH1) ఈవెంట్ లో అవని లేఖరా కాంస్య పతకం సాధించింది. 19 ఏళ్ల అవని లేఖరా పారాలింపిక్స్-2020లో ఇప్పటికే షూటింగ్ (10మీటర్ల ఎయిర్ రైఫిల్) విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా కాంస్యం కూడా గెలుచుకోవడంతో ఒకే పారాలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ క్రీడాకారిణిగా అవని లేఖరా సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది. మరోవైపు పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 12 కు (రెండు స్వర్ణం, ఆరు రజతం, నాలుగు కాంస్యాలు) చేరుకుంది.
కాంస్య పతకం సాధించిన అవని లేఖరాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. “టోక్యో పారాలింపిక్స్లో భారత్ కు మరింత వైభవం. అవని లేఖరా అద్భుతమైన ప్రదర్శన సంతోషాన్ని కలిగించింది. దేశానికి కాంస్య పతకాన్ని తెచ్చినందుకు ఆమెకు అభినందనలు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలి. ఆమెకు శుభాకాంక్షలు” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ