జాతీయస్థాయి సమస్యలపై పోరాటాల విషయంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయస్థాయి సమస్యలపై పోరాటాల నిర్వహణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు 9 మందితో ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ కమిటీలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డికి చోటు కల్పించారు. ఈ కమిటీకి ఛైర్మన్ గా పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ కమిటీలో చోటు దక్కడంపై ఉత్తమ్కుమార్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఈ కమిటీలో భాగమైనందుకు గౌరవంగా ఉందని, తనపై నమ్మకం ఉంచినందుకు అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చొరవను ముందుకు తీసుకెళ్లడానికి తన శక్తి మేరకు కృషి చేస్తానని ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కమిటీలో దిగ్విజయ్ సింగ్ (చైర్మన్), ప్రియాంకా గాంధీ, ఉత్తమ్కుమార్ రెడ్డి, మనీశ్ ఛత్రా, బీకే హరిప్రసాద్, రిపున్ బోరా, ఉదిత్ రాజ్, రాగిణి నాయక్, జుబిర్ ఖాన్ సభ్యులుగా ఉండనున్నారు.
Honoured to be a part of such an esteemed team. I thank honourable President, @INCIndia, Madam Sonia Gandhi Ji & Shri @RahulGandhi Ji for reposing faith in me. I shall work to the best of my abilities to take this initiative forward. pic.twitter.com/C0DLz3vXN5
— Uttam Kumar Reddy (@UttamINC) September 2, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ