ఏఐసీసీ కీలక కమిటీ ఏర్పాటు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి చోటు

MP Uttam Kumar Reddy Nominated for AICC’s Committee, Congress sets up panel to Prepare Plans for Sustained Agitations, Mango News, Latest Breaking News, Political News Updates, Former TPCC President and Lok Sabha MP N Uttam Kumar Reddy, Lok Sabha MP Uttam Kumar Reddy, senior Congress leader Digvijay Singh, MP Uttam Kumar Reddy, AICC Committee

జాతీయస్థాయి సమస్యలపై పోరాటాల విషయంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయస్థాయి సమస్యలపై పోరాటాల నిర్వహణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు 9 మందితో ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ కమిటీలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి చోటు కల్పించారు. ఈ కమిటీకి ఛైర్మన్‌ గా పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ కమిటీలో చోటు దక్కడంపై ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఈ కమిటీలో భాగమైనందుకు గౌరవంగా ఉందని, తనపై నమ్మకం ఉంచినందుకు అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చొరవను ముందుకు తీసుకెళ్లడానికి తన శక్తి మేరకు కృషి చేస్తానని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ కమిటీలో దిగ్విజయ్‌ సింగ్‌ (చైర్మన్), ప్రియాంకా గాంధీ, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మనీశ్‌ ఛత్రా, బీకే హరిప్రసాద్‌, రిపున్‌ బోరా, ఉదిత్‌ రాజ్‌, రాగిణి నాయక్‌, జుబిర్‌ ఖాన్‌ సభ్యులుగా ఉండనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =