కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత కేటగిరీ ద్వారా మరియు నేరుగా రాష్ట్రాల సేకరణ కేటగిరీ ద్వారా ఇప్పటికి మొత్తం 33.63 కోట్లకుపైగా (33,63,78,220) కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు. ఇందులో వ్యాక్సిన్ వృధాతో కలిపి జూలై 2, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 33,73,22,514 డోసులను వినియోగించినట్టు ప్రకటించారు. అలాగే మరో 44.9 లక్షల (44,90,000) వ్యాక్సిన్ డోసులు పైప్ లైన్ లో ఉన్నాయని, రాబోయే 3 రోజుల్లో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు వాటిని స్వీకరించనున్నాయని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ