దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో జూలై 2, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 4 లక్షలు దాటింది. గత 24 గంటల్లో కరోనాకు చికిత్స పొందుతూ మరో 835 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,00,312 కి పెరిగింది. ఇక కొత్తగా 46,617 కరోనా కేసులు నమోదవడంతో, పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,58,251 చేరుకుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది.
దేశంలో 5 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.01 శాతం:
గతకొన్నిరోజులుగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అస్సాం, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఛత్తీస్ గడ్ వంటి 10 రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 5,09,637 (1.67%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 59,384 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 2,95,48,302 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 97.01 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.31 శాతంగా ఉంది. ఇక జూలై 1, గురువారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 41,42,51,520 కు చేరుకుంది. గత 24 గంటల్లో 18,80,026 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ