దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురి హస్తం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దీనికి సంబంధించి ఇప్పటికే రెండుసార్లు దాడులు చేసినది. ఇక దీనిలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి దీనిలో హస్తముందంటూ వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ ఆరోపణలపై స్పందించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒంగోలులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో తనకెలాంటి సంబంధం లేదని, అలాగే తమ కుటుంబ సభ్యుల పాత్ర కూడా దీనిలో లేదని స్పష్టం చేశారు. గత 50 ఏళ్లుగా తమ కుటుంబం లిక్కర్ వ్యాపారంలో వుందని, తన తండ్రి హయాం నుంచే ఈ వ్యాపారంలో కొనసాగుతున్నామని తెలిపారు.
అయితే ఇటీవల ఢిల్లీ, చెన్నై నగరాల్లోని తమ కుటుంబానికి చెందిన నివాసాలు, ఆఫీసులపై ఈడీ దాడులు చేయడం నిజమేనని, కానీ ఈ దాడుల్లో అదియూకారులకి ఎలాంటి ఆధారాలు లభించలేదని వెల్లడించారు. తాను, తన కుమారుడు ఢిల్లీ లిక్కర్ బిజినెస్లో డైరెక్టర్లుగా లేమని, సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులకి దీనిపై అనుమానాలను నివృత్తి చేశామని మాగుంట వివరించారు. ఇక తమ కుటుంబానికి కేవలం దక్షిణాదిలోనే వ్యాపారాలు ఉన్నాయని, ఉత్తర భారతదేశంలో ఎలాంటి వ్యాపారాలు లేవని స్పష్టం చేశారు. ఢిల్లీలో మొత్తం 32 జోన్లు ఉంటే, తమ బంధువులు కొందరు 2 జోన్లలో వ్యాపారం చేస్తున్నారని, అయితే వారి ఇంటిపేరు కూడా మాగుంట అనే ఉండటం వలన ఈడీ అధికారులు పొరపడ్డారని తెలిపారు. ఇక రాజకీయాలకొస్తే 2024లో తాను పోటీ చేయబోవడం లేదని, ఈసారి ఒంగోలు ఎంపీగా తన కొడుకు రాఘవ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY