సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై తమిళనాడులో భారీ అంచనాలు నెలకున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ ప్రకటన, రాజకీయ ప్రవేశం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు, అభిమానులను ఉద్దేశించి ఆయన రాసినట్లు ఓ లేఖ సోషల్మీడియాలో వైరల్ అయింది. ఈ లేఖపై స్పష్టత లేక అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖపై రజనీకాంత్ స్పందిస్తూ ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.
“నేను నివేదించినట్టుగా వెబ్సైట్లు మరియు సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అవుతుంది. ఇది నా ప్రకటన కాదని అందరికీ తెలుసు. అయితే అందులో నా ఆరోగ్యం గురించి, వైద్యులు నాకు ఇచ్చిన సలహాలన్నీ నిజమే. రాజకీయాల విషయానికి సంబంధించి నా రజనీ మక్కల్ మండ్రమ్ సభ్యులతో నిర్ణీత సమయంలో చర్చిస్తాను మరియు సరైన సమయంలో నా రాజకీయ ఆలోచన గురించి ప్రజలకు తెలియజేస్తాను” అని రజనీకాంత్ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
— Rajinikanth (@rajinikanth) October 29, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu