- ఉత్తర్ ప్రదేశ్ లో 403 స్థానాలకు గానూ 243 పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. 118 స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ దాని మిత్రపక్షాలు, 8 స్థానాల్లో బీఎస్పీ, 5 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి.
- పంజాబ్ లో 117 స్థానాలకు గానూ 81 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 16 చోట్ల, శిరోమణి అకాలీదళ్+ 14 చోట్ల, బీజేపీ+ 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
- ఉత్తరాఖండ్ లో 70 స్థానాలకు గానూ 40 స్థానాల్లో బీజేపీ ముందంజ. 25 స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్
- మణిపూర్ లో 60 స్థానాలకు గానూ 24 స్థానాల్లో బీజేపీకి ఆధిక్యం. కాంగ్రెస్+ 12 చోట్ల, ఎన్పీపీ 9 చోట్ల, ఇతరులు 23 చోట్ల ముందంజ.
- గోవాలో 60 స్థానాలకు గానూ బీజేపీకి 17 స్థానాల్లో, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి 15 స్థానాల్లో ఆధిక్యం. టీఎంసీ 5, ఇతరులు 2, ఆప్ 2 స్థానాల్లో ముందంజ.
దేశంలో ఉత్తర్ ప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, అనంతరం రౌండ్ల వారీగా ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఉత్తర్ ప్రదేశ్ లో 403, గోవాలో 40, పంజాబ్ లో 117, మణిపూర్ లో 60, ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల్లో మొత్తం 690 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలు ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మినీ సంగ్రామంగా పేర్కొంటున్న ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ