రాష్ట్రంలో కరోనా మహమ్మారి వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునే విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వలన అనాథలుగా మారిన పిల్లల పేరుపై రూ.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ప్రతి నెలా పిల్లలకు అందజేయనున్నారు. ఆ పిల్లలకు 25ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ అధికారులకు సోమవారం నాడు ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయంపై కార్యాచరణ రూపొందించి, ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ఉత్తర్వులను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ