తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రధానితో సీఎం స్టాలిన్ భేటీ అవ్వడం ఇదే మొదటి సారి. ఈ భేటీ సందర్భంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చినట్టు తెలుస్తుంది. భేటీ అనంతరం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ప్రధాని మోదీతో భేటీ సంతృప్తికరంగా ముగిసిందన్నారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం అందిస్తామని, ఆ విషయంలో ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని ప్రధాని హామీ ఇచ్చినట్టు స్టాలిన్ తెలిపారు. అలాగే మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం, నీట్ మరియు నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయడం, చెంగల్ పట్టు కాంప్లెక్స్ లో వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించడం, సేతుసముద్రం ప్రాజెక్టు పునరుద్ధరణ సహా పలు అంశాలును ప్రధానితో భేటీ సందర్భంగా చర్చించినట్టు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ