కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జనవరి 23, ఆదివారం నాడు పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ లాక్డౌన్ శనివారం రాత్రి 10 గంటలకే ప్రారంభమై, సోమవారం ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉండనుంది. ఈ లాక్డౌన్ సమయంలో కేవలం అత్యవసర సేవలు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.
రాష్ట్రంలో పాల దుకాణాలు ఏటీఎం కేంద్రాలు, ఆసుపత్రులు, సరుకుల రవాణా, పెట్రోల్ బంక్లు అనుమతి ఇచ్చారు. అలాగే లాక్డౌన్ సమయంలో విమానాశ్రయం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ఆటోలు మరియు ట్యాక్సీలు అనుమతించనున్నారు. రెస్టారెంట్లు మరియు హోటళ్లకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు టేకౌట్ సేవలను అందించనున్నాయి. ఇక తమిళనాడులో ఇప్పటివరకు 30,72,666 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 28,48,163 మంది కరోనా నుంచి కోలుకోగా, 37,145 మంది మరణించారు. ప్రస్తుతం 1,87,358 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF