తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 512 పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 14, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,08,173 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 293 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 6 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. ఇక గురువారం నాడు 25,287 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 543 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 7,99,011 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,051 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (512):
- హైదరాబాద్ – 293
- రంగారెడ్డి – 53
- మేడ్చల్ మల్కాజిగిరి – 49
- ఖమ్మం – 15
- భద్రాద్రి కొత్తగూడెం – 11
- నల్గొండ – 11
- హనుమకొండ – 9
- పెద్దపల్లి – 8
- మహబూబ్ నగర్ – 8
- సిద్దిపేట – 6
- సంగారెడ్డి – 6
- కరీంనగర్ – 6
- ఆదిలాబాద్ – 5
- నిజామాబాద్ – 5
- యాదాద్రి భువనగిరి – 5
- మహబూబాబాద్ – 4
- మంచిర్యాల – 3
- జనగామ – 3
- నాగర్ కర్నూల్ – 2
- రాజన్న సిరిసిల్ల – 2
- వికారాబాద్ – 2
- జోగులాంబ గద్వాల్ – 1
- కామారెడ్డి – 1
- కొమరం భీం ఆసిఫాబాద్ – 1
- వరంగల్ రూరల్ – 2
- నారాయణ్ పేట్ – 1
- సూర్యాపేట – 1
- జగిత్యాల – 0
- జయశంకర్ భూపాలపల్లి – 0
- ములుగు – 0
- మెదక్ – 0
- వనపర్తి – 0
- నిర్మల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY