భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1562 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై నగరంలోనే ఈ రోజు 1149 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33,269 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 23,298 కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో నమోదైన 17 కరోనా మరణాలతో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 286 కి చేరింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 528 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 17,527 కి చేరింది. ప్రస్తుతం 15,413 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu