తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 1, శనివారం నాడు ఒక్కరోజే 5879 కరోనా పాజిటివ్ కేసులు, 99 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,51,738 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 1,00,877 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరోవైపు శనివారం నాటికీ రాష్ట్రంలో 27,18,718 కరోనా పరీక్షలను నిర్వహించి, దేశంలో కరోనా పరీక్షల నిర్వహణలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.
తమిళనాడు కరోనా కేసుల వివరాలు (ఆగస్టు 1, శనివారం నాటికీ):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 2,51,738
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 1,90,966
- యాక్టీవ్ కేసులు – 56,738
- ఆగస్టు 1 న నమోదైన కేసులు – 5879
- ఆగస్టు 1 న డిశ్చార్జ్ అయినవారు – 7010
- ఆగస్టు 1 న నమోదైన మరణాల సంఖ్య – 99
- మొత్తం మరణాల సంఖ్య – 4034
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu