ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 12750 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 76614 కు చేరుకుంది. మరోవైపు కొత్తగా 9276 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆగస్టు 1, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 150209 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) రికార్డ్ స్థాయిలో 60797 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో మరో 58 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా వలన తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది మంది, విశాఖపట్నంలో ఎనిమిది మంది, గుంటూరులో ఏడుగురు, అనంతపూర్ లో ఆరుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూల్ లో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, నెల్లూరు లో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1407 కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 72188 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu