దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,68,063 కరోనా పాజిటివ్ కేసులు, 277 మరణాలు నమోదయ్యాయి. దీంతో జనవరి 11, మంగళవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 3,58,75,790 కు, మరణాల సంఖ్య 4,84,213 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 10.64 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 8.85 శాతంగా ఉంది.
దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 69,959 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,45,70,131 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 96.36 శాతం గానూ, మరణాల రేటు 1.35 శాతంగా ఉంది. కాగా ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానంలో, కరోనా మరణాలు ఎక్కువుగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 8,21,446 (2.29) మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు దేశంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 4,461కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, అత్యధికంగా మహారాష్ట్రలో 1247, రాజస్థాన్ లో 645, ఢిల్లీలో 546, కర్ణాటకలో 479, కేరళలో 350, ఉత్తర్ ప్రదేశ్ లో 275, గుజరాత్ లో 236, తమిళనాడులో 185, తెలంగాణలో 123, హర్యానాలో 123, ఒడిశాలో 74, ఆంధ్రప్రదేశ్ లో 28, బీహార్ లో 27, పంజాబ్ లో 27, వెస్ట్ బెంగాల్ లో 27, గోవాలో 21, మధ్యప్రదేశ్ లో 10, అస్సాంలో 9, ఉత్తరాఖండ్ లో 8, మేఘాలయలో 5, జమ్మూ అండ్ కాశ్మీర్ లో 4, అండమాన్ అండ్ నికోబార్, చండీఘర్ లలో 3 చొప్పున, పుదుచ్చేరిలో 2, ఛత్తీస్ గర్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, మణిపూర్ లలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. కాగా మొత్తం 4,461 బాధితుల్లో ఇప్పటికే 1,711 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ