ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘యాపిల్’ కీలక ప్రకటన చేసింది. భారతదేశపు తన మొట్ట మొదటి ఔట్లెట్ (రిటైల్ స్టోర్)ను ఏప్రిల్ 18న ముంబైలో ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఏప్రిల్ 20న ఢిల్లీలో రెండవ స్టోర్ను ఓపెన్ చేస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా ఈ రిటైల్ స్టోర్ను యాపిల్ బీకేసీగా వ్యవహరిస్తున్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో ఏప్రిల్ 18న ఉదయం 11 గంటలకు తొలి అధికారిక రిటైల్ స్టోర్ అందుబాటులోకి రానుంది. ఇక ఇదే క్రమంలో మరో రెండు రోజులకే దేశ రాజధాని న్యూఢిల్లీలో రెండో రిటైల్ స్టోర్ను ఓపెన్ చేయనుంది యాపిల్. ఢిల్లీలో ప్రారంభించనున్న దానిని యాపిల్ సాకెట్ స్టోర్గా సంభోదిస్తున్నారు.
ఢిల్లీ సాకెట్లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటలకు యాపిల్ రిటైల్ స్టోర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. కాగా ముంబైలోని యాపిల్ బీకేసీ రీటైల్ స్టోర్ 22,000 చదరపు విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. లాస్ఎంజెల్స్, న్యూయార్క్, బీజింగ్, మిలాన్, సింగ్పూర్ వంటి నగరాల తర్వాత ముంబైలోనే యాపిల్ ఐ-ఫోన్ రిటైల్ స్టోర్ ఏర్పాటు కానుండటం గమనార్హం. అలాగే ముంబైలో ప్రారంభించే యాపిల్ స్టోర్ మాదిరిగానే ఢిల్లీ రిటైల్ స్టోర్ సైతం దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ఇక యాపిల్ బీకేసీ లోగోను ముంబై ఐకానిక్ ఆర్ట్ అయిన ‘కాలీపీలి టాక్సీ ఆర్ట్’తో రూపొందించగా.. ఢిల్లీ సాకేత్ లోగోను ఆ రాష్ట్ర సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE