తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 27, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,80,844 కి పెరిగింది. అలాగే కరోనాతో మరోకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,023 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక సోమవారం నాడు 37,839 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 181 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,73,404 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,417 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. సోమవారం నాడు ఒక్కరోజే మరో 12 కేసులు నమోదవడంతో, రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 55కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో రిస్క్ కంట్రీస్ నుండి కాకుండా ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో 10 మందికి, ఒమిక్రాన్ పాజిటివ్ కాంటాక్ట్ వ్యక్తులైన మరో ఇద్దరికీ ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. కాగా వీరిలో ఇప్పటికే 10 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు. మరోవైపు 19 మంది శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని, ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ