బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ముందుగా కరోనా లక్షణాలు కన్పించడంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలడంతో, సోమవారం రాత్రే గంగూలీ కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. గంగూలీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. గంగూలీ ఇప్పటికే రెండు డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నాడు. అయినప్పటికీ ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యంలో కరోనా బారిన పడినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ ఏడాది ప్రారంభంలో గుండె సంబంధిత సమస్యలతో గంగూలీ రెండుసార్లు ఆసుపత్రిలో చేరి, యాంజియోప్లాస్టీ చేయించుకున్న విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ