టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లో ఓటమి పాలైంది. మంగళవారం ఉదయం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ప్రపంచ నంబర్ వన్ బెల్జియం జట్టు, భారత్ పై 5-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత్ జట్టు మ్యాచ్ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన చేసి, చివరి వరకు విజయం కోసం పోరాడింది. అయితే బెల్జియం డిఫెన్స్ దాటికి తడబడడం, బెల్జియంకు 14 పెనాల్టీ కార్నర్ అవకాశాలు రావడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. మూడు క్వార్టర్ లు ముగిసేసరికి ఇరు జట్లు 2-2తో సమంగా ఉండగా, నాలుగో క్వార్టర్ లో జరిగిన హోరాహోరీ పోరులో బెల్జియం ఆటగాళ్లు హెండ్రిక్స్ 2, దొహెమన్ 1 గోల్ చేసి 5-2 తో విజయాన్ని సొంతం చేసుకున్నారు.
కాగా సెమీస్ చూపిన భారత్ జట్టు చూపిన పోరాట పటిమ పట్ల ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. మరోవైపు భారత్ జట్టు కాంస్య పతాకాన్ని సొంతం చేసుకునేందుకు మరో అవకాశం ఉంది. ఒలింపిక్స్ లో హాకీ యొక్క మరో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, జర్మనీ జట్లు పోటీపడగా, ఆస్ట్రేలియా జట్టు 3-1 తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. దీంతో కాంస్య పతకం కోసం ఆగస్టు 5, గురువారం ఉదయం 7 గంటలకు జర్మనీతో భారత్ జట్టు పోటీపడనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ