కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. రాయచూర్‌ జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి

Tollywood Filmmaker SS Rajamouli Appointed as Poll Campaigner For Raichur District by Karnataka State Election Commission,Tollywood Filmmaker SS Rajamouli,SS Rajamouli Appointed as Poll Campaigner,Karnataka State Election Commission,Poll Campaigner For Raichur District,Mango News,Mango News Telugu,Tollywood Filmmaker SS Rajamouli Latest News,Raichur Latest Updates,Karnataka Latest News and Updates,Karnataka News Today,Raichur Live News

కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్లని, ముఖ్యంగా యువతను చైతన్య పర్చేందుకు టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సేవలని వినియోగించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో రాజమౌళిని రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా నియమించింది. ఈ మేరకు ఆ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ నాయక్ ప్రచార కర్తగా రాజమౌళి పేరుని ఎన్నికల్ కమిషన్‌కు సిఫార్సు చేసినట్లు తెలిపారు. రాజమౌళిని జిల్లా ఎన్నికల ఐకాన్‌గా నియమించే ప్రతిపాదనకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని చంద్రశేఖర నాయక్ తెలిపారు. అలాగే తమ ప్రతిపాదనకు దర్శకుడు రాజమౌళి కూడా అంగీకరించినట్లు నాయక్ తెలిపారు.

ఓటు హక్కు వినియోగంపై ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి మరియు రాయచూరు జిల్లాలో ఈ ఏడాది ఓటింగ్ శాతం పెంచడం కోసం ప్రయత్నిస్తున్నామని, అందుకు రాజమౌళి సరైన వ్యక్తి అని భావించామని కలెక్టర్ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. కాగా ఎస్ఎస్ రాజమౌళి రాయచూరు జిల్లా మాన్వి తాలూకా అమరేశ్వర క్యాంపులో జన్మించారు. ఈ నేపథ్యంలో.. జిల్లాలో ఆయనతో ప్రచారం చేయిస్తే పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనిలో భాగంగా రాజమౌళి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రత్యక్షంగా ప్రచారం చేయడంతో పాటు, వీడియో సందేశాల రూపంలో కూడా ఓటర్లలో చైతన్యం నింపేలా ప్రయత్నిస్తారని అధికారులు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − four =