ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జనవరి 6, బుధవారం నాడు ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 170 మంది ప్రయాణికులు, సిబ్బందితో కూడిన ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 737 విమానం కూలిపోయింది. టెహ్రాన్లోని ఇమామ్ ఖొమైనీ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తుంది. కీవ్లోని ఉక్రేనియన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న సిబ్బంది సహా మొత్తం 170 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రకటించారు. అలాగే ప్రాధమిక సమాచారం బట్టి సాంకేతిక కారణాలతో విమానం కూలినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.