ఈ రోజు ఉదయం కోల్కతాలో తన పర్యటనకు కొన్ని గంటల ముందు అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకున్న బిజెపి కార్యకర్త మృతిపై సిబిఐ దర్యాప్తునకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీజేపీ యువజన విభాగానికి చెందిన అర్జున్ చౌరాసియా ఉత్తర కోల్కతాలోని తన ఇంటికి సమీపంలోని పాడుబడిన భవనంలో ఉరి వేసుకుని కనిపించాడు. కోల్కతాకు అమిత్ షా స్వాగతం కోసం ప్లాన్ చేసిన ఈవెంట్లలో ఈరోజు అతను బైక్ ర్యాలీకి నాయకత్వం వహించాల్సి ఉంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆయన్ను హత్య చేసిందని బీజేపీ ఆరోపించగా, ప్రభుత్వం దానిని తీవ్రంగా ఖండించింది. కాగా అర్జున్ చౌరాసియా BJYM మండల్ వైస్-ప్రెసిడెంట్ గా పార్టీలో సేవలందిస్తున్నారు.
బీజేపీ యువమోర్చా నాయకుడు అర్జున్ చౌరాసియా హత్య వెనుక ఉన్న వారిని శిక్షించేలా చూస్తాం. ఈ రాజకీయ హింసపై హోం మంత్రిత్వ శాఖ చాలా ఆందోళన చెందింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి నివేదిక కోరిందని అమిత్ షా చౌరాసియా కుటుంబ సభ్యులతో సమావేశమైన తర్వాత విలేకరులతో అన్నారు. నిన్నటితో తృణమూల్ ప్రభుత్వం పదవీకాలం పూర్తయి ఏడాది అయింది. నేడు మళ్ళీ రాష్ట్రంలో రాజకీయ హత్యలు మొదలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. అర్జున్ చౌరాసియా హత్యను బీజేపీ ఖండించింది. తీవ్ర దుఃఖంలో ఉన్న అతని కుటుంబాన్ని కలిశాను, అతని అమ్మమ్మను కూడా కొట్టారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. గత సంవత్సరం రాష్ట్ర ఎన్నికలలో బిజెపి ఓడిపోయిన తర్వాత అమిత్ షా మొదటిసారిగా బెంగాల్ రాజధానిని సందర్శించనున్న సమయంలో ఈ ఘటన జరగడంతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ