దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం దిశగా కేంద్రప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మూడో దశ వ్యాక్సినేషన్ లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో 18ఏళ్లు పైబడిన వారు కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఏప్రిల్ 28వ నుంచి కోవిన్ వెబ్సైట్లో (www.cowin.gov.in) రిజిస్టర్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఏప్రిల్ 28 నుండి కోవిన్ ప్లాట్ఫాం మరియు ఆరోగ్య సేతు యాప్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని, మే 1వ తేదీ నుంచి అపాయింట్మెంట్స్ ఇవ్వబడతాయని చెప్పారు. 18-45 సంవత్సరాల వాళ్ళకి సెల్ఫ్ రిజిస్ట్రేషన్స్ మరియు ముందస్తు అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే వ్యాక్సిన్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 45 ఏళ్లు పైబడినవారికి వారందరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22, గురువారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 13.23 కోట్లు (13,23,30,644) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత కొన్నిరోజులుగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ