తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 384 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,108 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే ఈ వైరస్ వలన ఇప్పటికి మరణించిన వారి సంఖ్య 1496 కి పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 631 మంది కోలుకోవడంతో, రాష్ట్రంలో కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 2,69,232 చేరుకుంది. ప్రస్తుతం 7,380 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే కరోనా పరీక్షలు సంఖ్య 61 లక్షలు దాటింది. ఆదివారం నాడు 28.980 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 61,57,683 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 1,65,440 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ