ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉక్రెయిన్ సంక్షోభంపై బౌద్ధ మత గురువు దలైలామా స్పందించారు. ఈ టిబెటన్ ఆధ్యాత్మిక మత గురువు ఉక్రెయిన్ సంక్షోభంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత తీవ్రమైన విభేదాలు అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు. యుద్ధం అనేది పూర్వకాలపు పద్దతి అని, అహింస ఒక్కటే మామని నోబెల్ శాంతి బహుమతి విజేత అయిన దలైలామా పేర్కొన్నారు. సాటి మనుష్యులను అన్నదమ్ములుగా భావించి మానవత్వం యొక్క ఏకత్వ భావనను పెంపొందించుకోవాలి. ఈ భావనతోనే మేము మరింత శాంతియుత ప్రపంచాన్ని నిర్మిస్తాము అని దలైలామా తెలిపారు.
“ఉక్రెయిన్లో జరుగుతున్న సంఘర్షణ పట్ల నేను చాలా బాధపడుతున్నాను. రెండు దేశాల మధ్య జరుగుతున్న హింసాత్మక విధానం వలన ప్రపంచంలోని మిగిలిన దేశాలు కూడా ప్రభావితమవుతాయి. ఈ పరిస్థితుల్లో మనం ఆశను కోల్పోకూడదు. 20వ శతాబ్దంలో మనం చూసిన యుద్దాలు, వాటివలన జరిగిన రక్తపాతం గురించి మనం మరోసారి గుర్తుచేసుకోవాలి. ఇప్పుడు శకం మారింది. ఆలోచనలు మారాయి. ఈ 21వ శతాబ్దాన్ని చర్చల శతాబ్దంగా మలుచుకుందాం. ఉక్రెయిన్ లో త్వరలోనే శాంతి పునరుద్ధరించబడుతుందని ఆశిస్తున్నాను” అని ఒక ప్రకటనలో దలైలామా అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ